త్వరలోనే 57 ఏళ్ల వారికి పెన్షన్లు ఇస్తాం
ఉగాది నాటికి డబుల్బెడ్రూం ఇళ్లు ఇస్తాం
సిద్దిపేట: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్రావు నేడు సిద్దిపేటలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఉండే సమస్యలపై స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. 10 రోజుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిద్ధిపేట మున్సిపాలిటీలో లంచాల బెడద లేదన్నారు. త్వరలోనే 57 ఏళ్ల వారికి పెన్షన్లు అందిస్తామన్నారు. ఉగాది నాటికి డబుల్బెడ్రూం ఇళ్లు ఇస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/