ధన్యవాదాలు నరేంద్ర మోడిజీ
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్
ముంబయి: 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాహుల్ ద్రవిడ్తో కలిసి తాను నెలకొల్పిన 376 పరుగుల చరిత్రాత్మక భాగస్వామ్యాన్ని వార్షిక ‘పరిక్ష పె చార్చా’ కార్యక్రమంలో విద్యార్ధులతో పంచుకున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి టీమిండియా మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం లక్ష్మణ్ తన ట్విట్టర్లో చారిత్రాత్మక కోల్కతా టెస్ట్ మ్యాచ్ కథను పంచుకున్నందుకు… యువ విద్యార్థులను ఉత్తేజపరిచినందుకు చాలా ధన్యవాదాలు మోడీజీ. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, నా సలహా ఇదే. మీ లక్ష్యాల గురించి స్పష్టంగా ఉండాలి… అది జరిగేలా ప్రయత్నించండి. మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోవద్దు అని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్పై మోడీ ప్రశంసలు కురిపించిన వీడియోని సైతం ట్వీట్ చేశాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/