కేంద్ర బడ్జెట్ పై ధన్యవాదాలు తెలుపుతూ హైదరాబాద్ లో భారీ ఫ్లెక్సీలు

కేంద్ర బడ్జెట్ పై ధన్యవాదాలు తెలుపుతూ హైదరాబాద్ లో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ మధ్య తరగతి ప్రజలు, డబుల్ బెడ్రూం బాధితుల సంఘం, తెలంగాణ నర్సింగ్ విద్యార్థులు, గిరిజన విద్యార్థి సమాఖ్య పేరిట ఈ హోర్డింగ్స్ ను ఏర్పటు చేసారు. ‘దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రధాన మంత్రి మోడీ కి హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ తెలంగాణ నర్సింగ్ విద్యార్థుల పేరిట ఓ హోర్డింగ్ కనిపించింది.

అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు రూ. 79 వేల కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్ రూం బాధితుల సంఘం పేరిట మరో హోర్డింగ్ ఏర్పాటు చేసారు. ప్రస్తుతం నగరంలో పెద్ద ఎత్తున ఇవి ఏర్పాటు చేయడం తో చర్చగా మారాయి. ఓ పక్క బిఆర్ఎస్ నేతలు బడ్జెట్ ఫై విమర్శలు చేస్తుంటే..ఇలా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం నేతలను సైతం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.