వారసుడు చిత్రాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న థమన్

తమిళ్ హీరో విజయ్ నటించిన వరిసు (తెలుగు లో వారసుడు) ఈరోజు తమిళనాట భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. అర్ధరాత్రి నుండే థియేటర్స్ వద్ద విజయ్ అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తూ నానా రచ్చ చేసారు. చెన్నైలో అభిమానులతో కలిసి చిత్రయూనిట్ తోపాటు.. వంశీ పైడిపల్లి, థమన్.. దిల్ రాజు.. నటుడు శ్యామ్ వరిసు చిత్రాన్ని వీక్షించారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఉత్సాహం.. అభిమానం.. వరిసు చిత్రానికి అభిమాను నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి థియేటర్లలో భావోద్వేగానికి గురయ్యారు థమన్.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి. వీరిద్దరిని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇక తెలుగు లో ఈ చిత్రాన్ని వారసుడు పేరుతో జనవరి 11 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ వాల్తేర్ వీరయ్య, వీర సింహ రెడ్డి చిత్రాల రిలీజ్ ఉండడం తో వాటికీ థియేటర్స్ సమస్య ఏర్పడుతుందని దిల్ రాజు జనవరి 14 కు వాయిదా వేశారు. రష్మిక హీరోయిన్ గా ఈ చిత్రంలో నటించింది. సినిమా కు పాజిటివ్ టాక్ రావడం తో తెలుగు లో కూడా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ హ్యాపీ గా ఉన్నారు.