బాలాకోట్‌లో మళ్లీ యువత ఉగ్రవాదులకు శిక్షణ

అక్కడే ఉన్న మసూద్ అజార్ సోదరుడు రవూఫ్ అజార్

Masood Azhar
Masood Azhar

న్యూఢిల్లీ: గత సంవత్సరం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త బ‌ల‌గాలు స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే మ‌ళ్లీ ఆ స్థావ‌రాల్లో ఉగ్ర‌వాదులు శిక్ష‌ణ పొందుతున్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వెల్ల‌డించాయి. బాలాకోట్ లో టెర్రర్ సంస్థ జైషే మొహమ్మద్ తన క్యాంపులను మళ్లీ యాక్టివ్ చేసింది. యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తోందని, భారత్ పై దాడులకు వీరిని తయారు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత్ సర్జికల్ దాడులు చేసిన స్థలంలోనే ఇప్పుడు జైషే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ఈ టెర్రర్ క్యాంపులకు సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. భారత్ కు, హిందుత్వకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం… మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఇక్కడి క్యాంపులోనే ఉన్నాడు. రవూఫ్ ను భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించే ఆపరేషన్లకు హెడ్ గా మసూద్ అజార్ నియమించాడు. గత ఏడాది పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి సూత్రధారి మసూద్ అజార్ అనే విషయం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/