ఐటీవో ప్రాంతంలో ఉద్రిక్తత
బస్సును ధ్వంసం చేసిన ఆందోళనకారులు
New Delhi: అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ కు చెందిన ఒక బస్సును ధ్వంసం చేశారు.
ఈ సంఘటన ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో జరిగింది. ర్యాలీగా వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆగ్రహంతో ఒక బస్సును ధ్వంసం చేశారు.
ఒక పోలీసు వాహనం కూడా ఆందోళన కారుల ఆగ్రహానికి ధ్వంసమైంది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/