జనసేన కార్యాలయం వద్ద ఉద్రికత్త

పోతిన మహేశ్ ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు

JanaSena Party
JanaSena Party

విజయవాడ: కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథానికి ఉన్న మూడు సింహాలు అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ ఈవో సురేశ్‌ బాబు రాజీనామా చేయాలని జసేసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. లేకుంటే దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిని రేపు ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా మహేశ్ ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో పార్టీ కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మహేశ్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినదిస్తున్నారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/