భారత్లో పదివేలు దాటిన కరోనా కేసులు
దేశవ్యాప్తంగా 339 మంది మృతి
దిల్లీ: దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతుంది. రోజురోజుకు భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 1,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశావ్యప్తంగా కరోనా భాధితుల సంఖ్య 10,363 కు చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా దేశంలో 339 మంది మరణించారు. దీనిబారి నుండి 1,035 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 2,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 160 మంది మరణించారు. డిల్లీలో 1,510 కరోనా పాజిటివ్ కేసులు, తమిళనాడులో 1,173 కేసులు నమోదు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/