కోహ్లీ సేనకు టెస్టుల్లో చేజారిన తోలి స్థానం

టెస్టుల్లో ప్రపంచ నెం.1 గా ఆస్ట్రేలియా

team india lossed test first rank
team india lossed test first rank

దుబాయ్ ; 2016 నుండి టెస్టుల్లో నెం.1 గా ఉన్న కోహ్లీ సేన ప్రస్తుతం ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. తాజాగా ఐసిసి ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా నెం.1 స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ రెండో స్థానం లో ఉండగా, భారత్ మూడో స్థానానికి చేరింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని అందుకోగా, న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది, ఇక 114 పాయింట్లతో భారత్ మూడవ స్థానానికి చేరుకుంది, తాజా ర్యాంకింగ్స్ కోసం 2019 మే నుంచి ఆడిన మ్యాచులు 100 శాతం, అంతకుముందు రెండేళ్లకు సంబందించిన మ్యాచులకు 50 శాతం రేటింగ్ పాయింట్లను ఆధారంగా తీసుకున్నారు, దీనితో భారత్ తోలి స్థానం నుండి మూడో స్థానానికి పడిపోయింది

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/international-news/