బంకర్‌లో నర్సాపురం విద్యార్థిని అవస్థలు

త్వరగా భారత్ కు తీసుకెళ్ళండి.. అంటూ వీడియో సందేశం పోస్ట్

ఉక్రెయిన్‌లో ఇంకా కొంతమంది భారతీయలు చిక్కుకునే ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఇదిలావుండగా, ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన ఉదయకుమారి కీవ్‌ ప్రాంతంలో చిక్కుకుకుంది. బంకర్స్‌లో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ తల్లిదండ్రులకు వీడియో సందేశం పంపించింది . బాంబు దాడులతో భయమేస్తోందని..తమను కూడా త్వరగా భారత్‌కు తీసుకెళ్లాలని ఉదయకుమారి విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/