బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్‌ ఇండియా షో

Wings India Air Show at begumpet airport
Wings India Air Show at begumpet airport

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో నేటి నుంచి వింగ్స్‌ ఇండియా ఎయిర్‌ షోను నిర్వహించనున్నారు. గురువారం నుంచి నాలుగురోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్‌ ఇండియా2020 ప్రదర్శనను 13 వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. పౌరవిమానయాన రంగంలో చేసిన సేవలకుగాను వివిధ సంస్థలు, వ్యక్తులకు అదేరోజు రాత్రి తాజ్‌కఅష్ణ హోటల్‌లో అవార్డులు అందజేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎయిర్‌ షో లు నిర్వహించనున్నారు. కొవిడ్‌19 వ్యాపించకుండా పౌరవిమానయానశాఖ, రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ప్రదర్శనకు వీలైనంత తక్కువ సంఖ్యలో విదేశీ ప్రతినిధులు హాజరయ్యేలా చూస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/