ప్రజాగ్రహంలో కొట్టుకుపోకముందే మేల్కొనండి

హైదరాబాదులో 12 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది..విజయశాంతి

vijayashanthi
vijayashanthi

హైదరాబాద్‌: కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సిఎం కెసిఆర్‌ పై మండిపడ్డారు. హైదరాబాదులోని దీనదయాళ్ నగర్ లో ఉన్న నాలాలో సుమేధ అనే 12 ఏళ్ల విద్యార్థిని పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ… కెసిఆర్‌ గారూ మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలో చెప్పండని ప్రశ్నించారు. అభంశుభం తెలియని చిన్నారి జీవితం కరిగిపోయిందని చెప్పారు.

విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా డ్రైనేజీలు, నాలాలు, మ్యాన్ హోల్స్ కనిపించనంతగా నీరు నిండిపోయి ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్క తీస్తే గిన్నిస్ రికార్డు అవుతుందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం, ఇలా జరక్కుండా చూస్తామని మాటలు చెప్పడం మామూలైపోయిందని దుయ్యబట్టారు. పాత ప్రభుత్వాల వల్లే హైదరాబాదులో పలు ప్రాంతాలు మునిగిపోతున్నాయని మీరు ఎన్నో సార్లు విమర్శించారని… మరి ఈ ఆరేళ్ల పాలనలో మీరు చేసిందేమిటని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఇతర పట్టణాలు, నగరాలు కూడా హైదరాబాదుకు తోడవుతున్నాయని… అడుగడుగునా కబ్జాలు, అక్రమ కట్టడాలతో చినుకు పడితే చాలు ఆ ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి నెలకొందని విజయశాంతి అన్నారు. ప్రజాగ్రహంలో మీరు కొట్టుకుపోకముందే… మేల్కొని పరిస్థితిని చక్కదిద్దండని హితవు పలికారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/