కేబుల్ బ్రిడ్జ్‌పై వాహ‌నాల‌కు అనుమ‌తి

Durgam Cheruvu bridge Hyderabad

హైదరాబాద్‌: నగరంలోని దుర్గం చెరువుపై అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మంచిన తీగ‌ల వంతెనపై వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అధికారులు అనుమ‌తించారు. అయితే బ్రిడ్జిపై 40 కి.మీ. కంటే వేగంగా వాహ‌నాలు న‌డ‌ప‌కూడ‌ద‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిక‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాహనాల రాక‌పోక‌లను ప‌రిశీలిస్తున్నారు. వంతెన‌పై ప‌రిమితికి మించి వేగంగా వెళ్లే వాహానాల‌కు చ‌లానా విధిస్తున్నారు. పెద్ద గూడ్స్ వాహ‌నాల‌ను వంతెన‌పైకి అనుమ‌తించ‌డం లేదు. కాగా ఈ తీగ‌ల వంతెన‌ను మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటిఆర్‌ సెప్టెంబ‌ర్ 25న ప్రారంభించారు. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లతో నిర్మించారు. దీనికి పెద్ద‌మ్మ‌త‌ల్లి ఎక్స్‌ప్రెస్ వే అని పేరుపెట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/