గవర్నర్ వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందన
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ..’రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గారి వ్యాఖ్యలు, కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతున్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా రోజుకు లక్షల్లో టెస్టులు చేస్తుంటే తెలంగాణలో నిన్న చేసిన టెస్టులు కేవలం 19,579. కెసిఆర్ తీరుతో రాష్ట్రం మరియు హైదరాబాద్ అభాసుపాలవుతున్నాయి!’ అని ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/