ప్రభుత్వంపై ఉత్తమ్‌కుమార్‌ విమర్శలు

ఇష్టమొచ్చినట్టు రంగులు మార్చడం మీ రాజకీయంలో నడుస్తదేమో కరోనాతో కాదు

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ‘మీ ఇష్టమొచ్చినట్టు రంగులు మార్చడం మీ రాజకీయంలో నడుస్తదేమో, కరోనాతో కాదు. టెస్టులు చేయకుండా సూర్యాపేటను గ్రీన్ జోన్ గా ఎట్లా నిర్ధారించారు? టెస్టుల విషయంలో హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాదు. మీకు చేత కాదు, మేము సలహాలిస్తే వెటకారం చేస్తారు!’ అంటూ ఉత్తమ్ కుమార్ విమర్శించారు. కాగా, సూర్యాపేటతో పాటు రాష్ట్రంలో ఏప్రిల్‌ 22 నుంచి ఇప్పటి వరకు ఎన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించారో తెలపాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు నిన్న ఆదేశించింది. కరోనా పరీక్షలు ప్రాథమిక అనుమానితులకు చేసి, లక్షణాలు లేని రోగులకు చేయడం లేదంటూ సంకినేని వరుణ్‌రావు దాఖలు చేసిన పిల్‌ను నిన్న న్యాయస్థానం విచారించింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/