కేంద్ర బడ్జెట్ పై ఉత్తమ్, పొన్నాల విమర్శలు

తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు
సామాన్యుల ఆశలపై మోడి ప్రభుత్వం నీళ్లు చల్లింది

Uttam and Ponnala
Uttam and Ponnala

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర బడ్జెట్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..కేంద్ర బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్ లో ‘తెలంగాణ’కు ఒక్క రూపాయి కూడా కేటాయింలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ తమను నిరుత్సాహపరిచిందని చెప్పారు. మరోవైపు టీకాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కూడా బడ్జెట్‌ పై మాట్లాడుతూ, పెట్టుబడిదారుల కొమ్ముకాసేలా ఈ బడ్జెట్ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల ఆశలపై మోడి ప్రభుత్వం నీళ్లు చల్లిందని ధ్వజమెత్తారు. ఏడాదిలో జీడీపీ పది శాతానికి పెంచుతామనడం, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతూ ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? అంటూ కేంద్రబడ్జెట్ పై పొన్నాల విమర్శలు చేశారు. బడ్జెట్ లో విభజన హామీల ప్రస్తావనే లేదని, టిఆర్‌ఎస్‌ ఎంపీలు ఏం చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/