మేడారం జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు..

మేడారంను జాతీయ పండగగా గుర్తిస్తాము

arjun munda
union-minister-arjun-munda-visits-medaram

మేడారం: తెలంగాణలో మేడారం జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్నారని కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా అన్నారు. ఈ రోజు ఆయన మేడారం జాతరకు విచ్చేసి సమ్మక సారలమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ..మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించే అంశాన్ని ప్రధాని మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. త్వరలో గిరిజనుల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. గిరిజనుల దగ్గర ఆస్తులు లేకపోయినా..ఆనందం ఉందన్నారు. మరోసారి జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని అర్జున్‌ ముండా తెలిపారు.

తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/