వర్ధన్నపేటలో టిఆర్ఎస్ సంబరాలు
వరంగల్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు వర్ధనపేటలో టిఆర్ఎస్ గెలుపు సాధించింది. మొత్తం 12 వార్డుల్లో అత్యధికంగా టీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. 2 వార్డుల్లో కాంగ్రెస్ సభ్యులు గెలవగా.. బిజెపి 1, స్వతంత్రులు 1 వార్డు గెలిచారు. అత్యధిక వార్డులు కైవసం చేసుకోవడంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఫలితాలపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా గెలపొందిన అభ్యర్థులు వీరే:
- సమ్మెట సుధీర్(కాంగ్రెస్)
- తోటకూరి రాజమణి (టిఆర్ఎస్)
- కొండేటి అనిత సత్యం (బిజెపి )
- భూక్య శ్రీలత (కాంగ్రెస్)
- బానోత్ సునీత శ్రీనివాస్(ఇండిపెండెంట్) గెలుపు
- ఆన్గోతు తరుణ (టిఆర్ఎస్)
- పాలకుర్తి సుజాత (టిఆర్ఎస్)
- కోదాటి పద్మాదేవేందర్ (టిఆర్ఎస్)
- మంచాల రామకృష్ణ (టిఆర్ఎస్)
- తుమ్మల రవీందర్ (టిఆర్ఎస్)
- కోమడ్ల ఎలెందర్ రెడ్డి(టిఆర్ఎస్)
- పూజారి సుజాత రఘు(టిఆర్ఎస్)
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/