కెసిఆర్ ఆలోచనల వల్లే ఇది సాధ్యం అవుతుంది
మాజి ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనల వల్లే రాష్ట్రంలో కరోనా ను అదుపుచేయంగలుగు తున్నామని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నప్పటికి కెసిఆర్ ఆలోచన, ఆచరణ, అధికారుల పనితీరు వల్లే ఇది సాద్యమవుతుందని అన్నారు. కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తు రోజు ప్రజలకు భరోసానిస్తు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారన్నారు. ప్రపంచంలో అగ్రదేశాలకు కూడా సాద్యం కాని రీతిలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంశలు కురిపించారు. తమ ట్రస్ట్ ద్వారా అధికారలకు, పోలీస్ సిబ్బందికి మాస్క్లు, శానిటైజర్లు, అందజేస్తున్నామని పొంగులేటి అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/