తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు నష్టపోయామని వెల్లడి
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని టిఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి సాయం కేంద్రం అందించలేదని తెలిపింది. 2014 నుంచి ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా కేంద్రం నుంచి సాయం అందడంలేదని ఆరోపించింది. పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన వాటాతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రావాల్సిన నిధుల రూరంలో ఇప్పటివరకు తెలంగాణకు రూ.50 వేల కోట్ల పైచిలుకు మేర నష్టం వాటిల్లిందని టిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిందో వివరంగా వెల్లడించింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/