ట్యాబ్ ఇవ్వలేదని బాలుడి ఆత్మహత్య
Hyderabad: వీడియో గేమ్ ఆడుకునేందుకు ట్యాబ్ ఇవ్వలేదనే కోపంతో బాలుడు అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ లో చోటుచేసుకుంది.
మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని స్వప్న నిర్మాణ్ అపార్ట్ మెంట్ పెంట్ హౌస్లో ఉంటున్న శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు బాల వెంకట సత్య ప్రసాద్ ట్యాబ్తో ఆడుకుంటుంగా..పెద్ద కొడుకు నంద కిషోర్ ట్యాబ్ కావాలని అడిగాడు.
దీంతో తండ్రి శ్రీనివాస్ చిన్న కొడుకు సత్య ప్రసాద్ నుంచి ట్యాబ్ను తీసుకుని..పెద్ద కుమారుడు నంద కిషోర్కు ఇచ్చాడు. గేమ్ ఆడుకుంటుండగా తండ్రి ట్యాబ్ లాక్కోవడంపై మనస్థాపానికి గురైన సత్య ప్రసాద్ క్షణాల్లో బిల్డింగ్ పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు సత్య ప్రసాద్ కొండాపూర్లోని మహర్షి విద్యా మందిర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/women/