భయం భయంగా జనగామ జిల్లా వాసులు
మర్కజ్ నుండి వచ్చి ఊరంతా కలియ తిరగిన వ్యక్తులు
జనగామ: తెలంగాణలోని జనగామ జిల్లా ప్రజలు ఇపుడు భయంభయంగా గడుపుతున్నారు. అందుకు కారణం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మర్కజ్కు వెళ్లి రావడమే. అయితే జనగామ, వెల్దండ కు చెందిన ముగ్గురు వ్యక్తులు నిజాముద్దీన్ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చి ఊరంతా కలియతిరిగారు. ప్రార్దనలకు వెళ్లి వచ్చిన వారిలో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా. మరొకరు జిల్లా గ్రామీణాభివృద్ది కార్యాలయ ఉద్యోగి, ఇంకొకరు ప్రైవేటు ఉద్యోగి. వీరంతా దిల్లీ నుంచిన వచ్చిన తరువాత హోం క్వారంటైన్లో ఉండకుండా ఊరంతా కలియతిరగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే జనగామకు చెందిన ఇద్దరిని వరంగల్ ఎంజీఎం కు తరలించగా, వెల్దండకు చెందిన మరో వ్యక్తిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిచారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/