రిజర్వాయర్లో దూకి పదో తరగతి విధ్యార్థి సూసైడ్
ఆసిఫాబాద్: రిజర్వాయర్లో దూకి పదో తరగతి స్టూడెంట్ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్పట్టణం శ్రీనగర్కాలనీలో ఉండే నేరేళ్ల కరుణాకర్ కొడుకు విఘ్నేష్(16) స్థానిక జడ్పీ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 11న ప్రీ ఫైనల్ఎగ్జామ్ రాసిన తర్వాత నుంచి కనిపించడం లేదు. గురువారం కాగజ్నగర్టౌన్ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. శుక్రవారం ఉదయం పట్టణానికి సమీపంలోని కోసిని రిజర్వాయర్లో స్టూడెంట్ మృతదేహం బయటపడింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రాజ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిర్వహించారు. పరీక్షల భయమే ఆత్మహత్యకు కారణం కావచ్చని, తోటి స్టూడెంట్లతో ఫెయిల్అవుతానేమోనని చెప్పాడని ఎస్సై తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/