ఖమ్మం మిర్చి యార్డులో ఉద్రిక్తత

అంత ధర తగ్గిస్తారా అంటూ రైతుల నిరసన

Khammam mirchi yard
Khammam mirchi yard

ఖమ్మం: ఒక్క రోజు వ్యవధిలో ధర రూ.5 వేలు తగ్గించడాన్ని నిరసిస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగడంతో ఖమ్మం మార్కెట్ యార్డు వద్ద ఈ రోజు ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే యార్డు వద్ద గడచిన రెండు రోజులుగా జెండా పాట రూ.17 వేలుగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం హఠాత్తుగా రూ.5వేలు తగ్గించి రూ.12వేలుగా నిర్ణయించడంతో రైతులు ఆశ్చర్యపోయారు. ఇంతలోనే అంత ఎలా తగ్గుతుందంటూ ఆందోళనకు దిగారు. సరుకును అమ్మేది లేదంటూ యార్డు గేట్లకు తాళాలు వేసి భీష్మించుకు కూర్చున్నారు. యార్డుకు వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణను రైతులు చుట్టుముట్టారు. ధర పెంచేంత వరకు కదలనిచ్చేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి పరిస్థితి సద్దుమణిగించారు. అనంతరం చైర్మన్ వ్యాపారులతో చర్చించి జెండాపాట రూ.15వేలుగా నిర్ణయించి వెళ్లిపోయారు. చైర్మన్ వెళ్లిపోయిన తర్వాత వ్యాపారులు మాత్రం ఎప్పటిలాగే రూ.10వేల నుంచి రూ.12 వేల మధ్య కొంటామనడంతో రైతులు తమ పంట అమ్మేందుకు నిరాకరించారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/