కరోనా ఎఫెక్ట్‌..గవర్నర్‌ కార్యక్రమాలు వాయిదా

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి.

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి బారిన పడి దేశంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. తాజాగా రాజ్‌భవన్ వర్గాలు… కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందుకు ప్రధాన కారణం… కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సలహాయే. ప్రజలు సమూహాలుగా ఉండొద్దని ఆ శాఖ కోరింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్‌భవన్ వర్గాలు… ఈ నిర్ణయం తీసుకున్నాయి. తిరిగి ఎప్పుడు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశాలు మొదలయ్యేదీ ప్రస్తుతానికి చెప్పలేదు. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే రాజ్‌భవన్ వర్గాలు నెక్ట్స్ సమావేశాల తేదీలు నిర్ణయిస్తాయని తెలిసింది.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/