పుర ఫలితాలపై మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌

Harish Rao
Harish Rao

హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ ఆధిపత్యం వహిస్తూ వస్తుంది. అందరూ ఊహించినట్లుగానే టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల ఆధిక్యం సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మొత్తం 120 మున్సిపాలిటీల్లో దాదాపుగా 107 మున్సిపాలిటీలను టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. అంతేకాకుండా 9 కార్పోరేషన్లలోనూ టిఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్‌ఎస్‌ దేనని మరోసారి తెలంగాణ ప్రజలు రుజువు చేశారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌ ప్రభంజనమే వీసిందన్నారు. సిఎం కెసిఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు అభినందనలు తెలియజేస్తున్నట్లు హరీశ్ రావు ట్వీట్ చేశారు. అలాగే పార్టీ విజయానికి కృషి చేసిన మంత్రులు, టిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, టిఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/