కొంపల్లిలో ప్రశాంతంగా పోలింగ్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరగనుంది. కాగా కొంపల్లిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. బుధవారం ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలవద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొంపల్లిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 18 వార్డులు ఉండగా 81 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 24 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజింగ్ యాప్ను రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/