పిఎం-కేర్స్ కు విరాళం ప్రకటించిన తెలంగాణ గవర్నర్
రూ.5లక్షలు ఇస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్: కరోనాపై పోరాటానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన వంతుగా విరాళాన్ని ప్రకటించారు. కోవిడ్-19 పై పోరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు పిఎం కేర్స్ సహయనిధికి తన వంతుగా రూ. 5లక్షలు విరాళం ప్రకటించారు. కాగా కొద్ది రోజుల క్రితమే కరోనా పై పోరుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహయ నిధికి ఒక నెల వేతనంను గవర్నర్ విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబందించి రూ.3.50లక్షల చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి ఎం. జగదీశ్వర్కు ఇటీవల అందజేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/