తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ నుంచి ఏపీ, మహారాష్ట్రలకు వెళ్లడంపై నిషేధం

check post at maharastra border
check post at maharastra border

హైదరాబాద్ ; తెలంగాణ వాసులు ఏపీ, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి. ఇప్పటికే అక్కడ కరోనా కేసుల సంఖ్య పదివేలు దాటింది. మరో వైపు ఏపీ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతుంది . ఈ నేపథ్యములో తెలంగాణ ప్రభుత్వము కీలక నిర్ణయము తీసుకుంది ఈ రెండు రాష్ట్రాలకు తెలంగాణ ప్రజలు వెళ్లడంపై నిషేధం విధించింది. దీనితో తెలంగాణ సరిహద్దుల దగ్గర చెక్ పోస్టుల వద్ద తెలంగాణ ప్రభుత్వము భారీగా పొలిసు బలగాలను పెంచింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి; https://www.vaartha.com/andhra-pradesh/