నేడు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం కెసిఆర్‌

ట్రంప్ దంపతులకు కానుకలు అందజేయనున్న సిఎం కెసిఆర్‌

TS CM Kcr
TS CM Kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొననున్నారు. కాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ విందుకు కేంద్ర మంత్రులు, రాజకీయనేతలు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానం మేరకు విందులో పాల్గొనేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారని సమాచారం. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు, కూతురు ఇవాంకకు కేసీఆర్ కానుకలు అందించనున్నట్టు సమాచారం. కాగా, రాష్ట్రపతి గౌరవార్థం ఇస్తున్న ఈ విందులో మొత్తం 90 నుంచి 95 మంది వీఐపీలు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. కేసీఆర్ సహా మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, అసోం, హర్యానా, బీహార్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/