డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన పోచారం
వనపర్తి: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. వనపర్తి జిల్లాలోని ఖిల్లా ఘనపూర్ మండలం ఈర్ల తండాలో తెలంగాణ సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్పీకర్ పోచారం మంగళవారం ప్రారంభించారు. స్పీకర్ పోచారం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి లబ్దిదారులను కొత్త ఇండ్లలోకి గృహప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు, టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/