మార్చి 6న ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

Telangana Legislative Assembly
Telangana Legislative Assembly

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు వారాలపాటు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక, మార్చి 8వ తేదీన అసెంబ్లీలో ఆర్థిక శాఖమంత్రి తన్నీర హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదే బడ్జెట్ ను కౌన్సిల్ లో ప్రవేశపెట్టనున్నారు. సిఎఎ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీ స్పష్టత నివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమాశాల్లో సిఎఎ వ్యతిరేక బిల్లును అసెంబ్లీ అమోదించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే సిఎఎ వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/