ఖమ్మం జిల్లాలో బోణి కొట్టిన టిడిపి

ఆ ప్రాంతం ఆంధ్రాకు బార్డర్‌గా ఉండటమే ఈ విజయానికి కారణం

tdp
tdp

హైదరాబాద్‌: ఎట్టకేలకు తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో టిడిపి పార్టీ బోణి కొట్టింది. ఖమ్మం జిల్లాలోని మధిరలో 1వ వార్డును టిడిపి సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఆంధ్రాకు బార్డర్‌గా ఉండటమే ఈ విజయానికి కారణమని తెలుస్తోంది. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పురపోరులో కారు దూసుకుపోతుంది. ఇప్పటికే సత్తుపల్లి మున్సిపాలిటీ గులాబీ ఖాతాలో వేసుకుంది. వైరా మున్సిపాలిటీ 20 మున్సిపాలిటీలు ఉండగా..ఇప్పటి వరకు 7 స్థానాలో టిఆర్‌ఎస్‌ విజయభేరి మోగించింది. కొత్తగూడెం పురపాలికలో 30 స్థానాలుండగా..టిఆర్‌ఎస్‌ 10, సిపిఐ 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఇల్లెందులో 20 వార్డులుండగా హోరాహోరిగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అటు భైంసా బిజెపి- ఎంఐఎం మధ్య హోరాహోరిగా పోరు సాగుతోంది. ఇప్పటికే బిజెపి-6 వార్డులు గెలుచుకోగా..ఎంఐఎం 7 వార్డులు దక్కించుకుంది. భైంసాలో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల హవా కనిపించలేదు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/