తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్టే

ఆసుపత్రుల్లో మరణించిన వారికీ కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు

supreme court
supreme court

న్యూఢిల్లీ: ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంను ఆదేశించగా, ఆ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇక వాదనల సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా తన అభిప్రాయాలు వినిపించింది. అందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు లోబడే కరోనా పరీక్షలు చేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపింది. తెలంగాణ సర్కారు వాదనల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం ఈ వ్యవహారంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/