మేడారం జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త

మేడారం జాతర భక్తుల కోసం 20 ప్రత్యేక రైళ్లు

train
train

హైదరాబాద్‌: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ రూట్‌లో 10 రైళ్లు, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ రూట్‌లో 10 రైళ్లను ప్రకటించింది. ఈ 20 రైళ్లు మేడారం వెళ్లే భక్తులకు సేవలు అందించనున్నాయి. అన్ని ప్రత్యేక రైళ్లల్లో సెకండ్ క్లాస్ సీటింగ్ కోచ్‌లు ఉంటాయి. మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఈ ప్రత్యేక రైళ్లల్లో టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ 10 సర్వీసుల్ని ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. మౌలాలి, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ్, రఘునాథపల్లి, ఘనపూర్, పిండియాల్, కాజీపేట స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ రూట్‌లో ప్రత్యేక రైలు 10 సర్వీసులు ఉంటాయి. ప్రతీరోజు ఉదయం 05:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయల్దేరుతుంది. రాలపేట్, ఆసిఫాబాద్ రోడ్, రేపల్లెవాడ, రెచ్నీ రోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల్, పెద్దంపేట్, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూర్, ఒదెల, పోత్కపల్లి, బిసుగీర్ షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి రోడ్, కాజిపేటలో రైలు ఆగుతుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/