జూన్‌ 1 నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

errabelli dayakar rao
errabelli dayakar rao

హైదరాబాద్‌: కరోనాను ఎదుర్కొన్న తరహాలోనే వానాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొందామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ తెలిపారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు, ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. కాగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమ వివరాలను మంత్రి తెలియజేశారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రపరుద్దామన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ సీజనల్‌ వ్యాధులు ధరిచేరకుండా జాగ్రత్త పడదామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనంపారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/