శ్రీశైలం ‌ప్రమాదం.. ఆరు మృతదేహాలు లభ్యం

మరో ముగ్గురి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

Srisailam power plant fire

శ్రీశైలం: తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో లోపల చిక్కుకున్న 9 మందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. లోపల రెస్క్యూ సిబ్బంది గాలిస్తుండగా ఏఈ సుందర్ నాయక్ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత మరో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. కాగా ప్యానల్ బోర్డులో చెలరేగిన మంటలు జలవిద్యుత్ కేంద్రంలోని పలు యూనిట్లను కబళించాయి. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ కేంద్రంలో 30 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో 15 మంది ఓ టన్నెల్ ద్వారా సురక్షితంగా వెలుపలికి వచ్చేశారు. మిగిలిన 15 మందిలో ఆరుగురిని సహాయక సిబ్బంది కాపాడారు.  


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/