సార్‌.. అందరిని జాగ్రత్తగా చూసుకుంటాం… కేటిఆర్‌

స్టాలిన్‌ విజ్ఞప్తి మేరకు స్పందించిన కేటిఆర్‌

ration
ration

నిజామాబాద్‌: రాష్ట్రంలో తమిళనాడుకు చెందిన కొంతమంది చిరు వ్యాపారులు నిజామాబాద్‌ జిల్లా బాల్కోండ, కిసాన్‌ నగర్‌లో చిక్కుకున్నారని, వారిని ఆదుకోవాలని డిఎంకే అధినేత స్టాలిన్‌ చేసిన విజ్ఞప్తి మేరకు, తెలంగాణ మంత్రి కేటిఆర్‌ స్పందించారు. కేటిఆర్‌ ఆదేశాల మేరకు కిసాన్‌ నగర్‌లో తమిళులను గుర్తించిన అధికారులు వారికి ఒక్కొక్కరికి 12 కేజిల బియ్యం, 500రూపాయల నగదును అందజేశారు. ఈ విషయాన్ని కేటిఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. సార్‌… అందరిని జాగ్రత్తగా చూసుకుంటాం. స్థానిక అధికారులు వారి వద్దకు వెళ్లి 12 కేజిల బియ్యం, 500 డబ్బులు ఇచ్చారని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/