వాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులు
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు
నల్లగొండ: తెలంగాణలో లాక్డౌన్ విధించినప్పటికి ప్రజలు ఇష్టం వచ్చినట్టు రోడ్లవెంట తిరుగుతుండడంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో పలు నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఉమ్మడి నల్గోండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు. అనవసరంగా రోడ్లమీదకు వస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకి రావాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/