కెసిఆర్ పై కీలక వాక్యాలు చేసిన రేవంత్ రెడ్డి

మరో 12 నెలల్లో కాంగ్రస్ అధికారం… రేవంత్ రెడ్డి

హైద్రాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించారు. సీఎం ఆరోగ్యంగా ఉన్నారని, వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకు సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే కేసీఆర్ ఆరోగ్యం పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ఈ ప్లాన్ వేసుండొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి నాటకాలకు తెర తీశారని ఎద్దేవా చేశారు. కొత్త డ్రామాలు మొదలయ్యాయని దుయ్యబట్టారు. సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. ఓపిక పడితే మరో 12 నెలలో కాంగ్రస్ అధికారంలోకి వేస్తుందని తెల్పుకొన్నారు.

తాజా తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/