హైదరాబాద్లో దారుణం.. బాలికపై అత్యాచారం
13 ఏళ్ల మైనర్ బాలికపై పది రోజులుగా అత్యాచారం
హైదరాబాద్: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం చోటు చేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికపై జహంగీర్(30) అనే కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జహంగీర్ బాలిక ఇంటి పక్కనే ఉంటాడు. స్థానికంగా ఉన్న ఎంఎస్ మక్తాలో పంచర్ షాప్ నడుస్తూ ఉంటాడు.సాయంత్రం పూట బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో జహంగీర్.. ఆమెకు మాయమాటలు చెప్పి పది రోజులుగా అత్యాచారం చేస్తున్నాడు. రోజు రోజుకూ నీరసించి పోతున్న బాలికను చూసిన తల్లికి అనుమానం వచ్చింది. దీంతో ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు జహంగీర్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/