కన్హా శాంతి వనం ఓ పవిత్ర స్థలం
రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో పాల్గొన్న రామ్నాథ్ కోవింద్
రంగారెడ్డి: జిల్లాలోని నందిగామ మండలం కన్హా శాంతివనంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు సందర్శించారు. రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రామచంద్రమిషన్కు 150 దేశాల్లో కేంద్రాలు ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కేంద్రాల్లో లక్షలాది మంది అభ్యసిస్తున్నారని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. బుద్ధుడు, మహావీర్, గురునానక్, వివేకానంద ఆధ్మాత్మిక ప్రతినిధులని ఆయన వ్యాఖ్యానించారు. కన్హా శాంతి వనం ఓ పవిత్ర స్థలమని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/