కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎంజీఎంలో 25 పడకల ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం
వరంగల్: కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ఎంజీఎం సూపరిండెంట్ శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ ఎంజీఎంలో 25 పడకల ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వారికి అత్యవసర వైద్యం అందేలా ఏర్పాట్లు చేశామని సూపరిండెంట్ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని, ముందస్తుగా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. జలుబు, దగ్గు, ఫీవర్ వంటి లక్షణాలు కనిపిస్తే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి రావాలని ఆయన సూచించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/