ఈ ఏడాది ఒక్క అడుగు గణేశ్‌డి విగ్రహమే

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం

khiratabad ganesh
khiratabad ganesh

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రభావం ఖైరతాబాద్‌ గణేశ్‌డిపై కూడా పడింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటి సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం వినాయకచవితి సందర్భంగా కేవలం ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో భారీ ఎత్తున్న విగ్రహ ఏర్పాటును కమిటీ విరమించుకుంది. అంతేకాదు, భారీ విగ్రహ నిర్మాణం కోసం నిర్వహించే కర్ర పూజను సైతం రద్దు చేసింది. వాస్తవానికి ఈ నెల 18న కర్ర పూజ చేసి శాస్త్రోక్తంగా విగ్రహ తయారీకి ఉపక్రమించాలని భావించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఉత్సవ కమిటీ షెడ్యూల్ మారిపోయింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/