గాంధీ ఆసుపత్రి నుంచి ఎవరూ పరారు కాలేదు

చిలకలగూడ సిఐ వివరణ

gandhi hospital
gandhi hospital

హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డు నుండి రోగి పరారు అయినట్లు వస్తున్న వార్తలపై చిలకలగూడ సిఐ బాలగంగిరెడ్డి వివరణ ఇచ్చారు. గాంధీ ఆసుపత్రి నుంచి ఎవరూ పరారు కాలేదని సిఐ తెలిపాడు. ఒక వార్డులో భాధితుడు బాత్‌రూమ్‌ కోసమని మరోక వార్డులోకి వెళ్లడంతో కాసేపు కనింపించలేదు. దీనితో భాధితుడు తప్పించుకున్నాడు అంటూ ప్రచారం జరిందని అన్నారు. ఆ వ్యక్తిని మరో వార్డులో గుర్తించి తిరిగి ఐసోలేషన్‌ వార్డుకి పంపామని పోలీసులు తెలిపారు.

తాజా జాతీమ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/