ఏపికి వెళ్లే వారిపై తెలంగాణ కొత్త ఆంక్షలు

ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకూ మాత్రమే అనుమతి..నల్గొండ ఎస్పీ రంగనాథ్

new-rules-for-telangana

హైదరాబాద్‌: తెలంగాణ నుండి ఏపిలోకి వెళ్లే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై తమకు ఆదేశాలు అందాయని, రాత్రి 7 గంటలలోపు మాత్రమే ఆయా వాహనాలు వాడపల్లి వద్ద సరిహద్దులను దాటాల్సి వుంటుందని నల్గొండ ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. అది కూడా పాస్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. జిల్లా మీదుగా మాచర్ల వైపునకు వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదని వెల్లడించిన ఆయన, ఏ వాహనమైనా వాడపల్లి మీదుగానే వెళ్లాల్సి వుంటుందని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ వద్ద చెక్ పోస్టు మూతబడివుంటుందని, కేవలం నిత్యావసర, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. ప్రజలు ఈ ఆంక్షలను గమనించాలని సూచించారు. కాగా తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఏపిలోకి వెళ్లేవారిని అక్కడి అధికారులు 14 రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/