హైకోర్టులో రేవంత్‌ రెడ్డి పిటిషన్‌

ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్‌ రెడ్డి..పార్లమెంటు సమావేశాలున్నాయి..బెయిల్ ఇవ్వండి

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌రెడ్డి డ్రోన్ కెమెరా వినియోగించారన్న కేసులో హైకోర్టును ఆశ్రయించారు. ఈకేసుకు సంబంధించి రేవంత్‌ ఈరోజు హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తన పై నమోదైన కేసును కొట్టివేయాలని, మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ ను రద్దు చేయాలని, పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని, కోరుతూ మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న రేవంత్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టులో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ రేవంత్ తరపున వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన నేతృత్వంలోని లాయర్ల బృందం హైదరాబాద్ చేరుకుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/