పుర చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్టు
చౌటుప్పల్: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో సిపిఎం కార్యకర్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ టిఆర్ఎస్, సిపిఎం మధ్య పొత్తు కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిని ఆయన అడ్డుకున్నారు. అలాగే మునుగోడు మాజీ
ఎమ్మెల్యె కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని, ఇరు పార్టీల కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో లాఠీచార్జ్ జరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/