22న హరితహారంపై ప్రత్యేక సమావేశం
25వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్న హరితహారం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జీహెచ్ఎంసి కార్యాలయంలో ఈనెల 22న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆయా నియోజక వర్గాలలో, డివిజన్లలో చేపట్టాల్సిన హరితహారం కార్యక్రమాల వివరాలు, మొక్కల పంపిణీ కేంద్రాల వివరాలు తదతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమూద్అలీ, సబితారెడ్డి, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్తోపాటు జీహెచ్ఎంసి పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు, జోనల్కమిషనర్లు హెచ్ఎండిఏ అధికారులు పాల్గొంటారని తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/