అభిమానులతో సెల్ఫీ..మంత్రి కడియం మాయం

మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో ఘటన

srinivas-goud
srinivas-goud

మహబూబ్‌నగర్‌: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన చేతి బంగారు కడియాన్ని పోగొట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో స్థానికంగా జరిగిన ఓ వివాహానికి హాజరైన మంత్రిని చూసిన అభిమానులు సెల్ఫీల కోసం క్యూకట్టారు. వారిని నిరాశపరచడం ఇష్టంలేని మంత్రి వారితో ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత చూసుకుంటే ఆయన చేతికి ఉండాల్సిన బంగారు కడియం మాయమైంది. దీంతో విస్తుపోవడం మంత్రిగారిపనైంది. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కడియం మంత్రికి సెంటిమెంట్ కావడంతో ఎవరైనా తీసి ఉంటే ఇచ్చేయాలని పోలీసులు బతిమాలుకోవడం కనిపించింది.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/